వేమన శతకము - పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి
పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ! వినురవేమ!
భావము : మనుషులంతా ఒకటే. పశువులు వేరు వేరు రంగులతో ఉన్నప్పటికీ అవి
యిచ్చే పాలుమాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనషులు వివిధ
వర్ణాలవారైనా మనసులు ఒకటిగా మసలు కోవాలంటాడు వేమన. పూవులు
వేరు వేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ
ఒక్కటే గదా!
0 comments:
Post a Comment